తన చివరి కోరిక చెబుతూ వీడియో విడుదల చేసిన నిత్యానంద

  • మరో వీడియో విడుదల చేసిన నిత్యానంద
  • కైలాసం నిర్మాణం పూర్తయింది 
  • నేను ఇక తమిళనాడుకు రాను
  • నేను మృతి చెందితే భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలి
స్వయం ప్రకటిత దైవ స్వరూపుడు స్వామి నిత్యానంద కొన్ని రోజుల క్రితం  ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిలో కైలాసం పేరిట స్వతంత్ర దేశాన్ని నిర్మిస్తున్నానని తెలిపి సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన మరో వీడియోను విడుదల చేసి  కైలాసం నిర్మాణం పూర్తయిందని ప్రకటించారు. ఇకపై తాను తమిళనాడుకు రానని చెప్పేశాడు. తాను మృతి చెందితే తన భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలని చెప్పాడు. అదే తన చివరి కోరిక అని అన్నాడు.  

బాలికల అపహరణ, వేధింపులపై తనపై కొందరు కేసులు పెట్టడంతో భయపడిపోయిన నిత్యానంద విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నాడు. అతడి ఆచూకీ కోసం ఇప్పటికే ఇంటర్‌పోల్‌  నోటీసులు జారీ చేసింది.

nityananda
India
Tamilnadu

More Telugu News